
దగా చేస్తున్నారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అధికారంలోకి రాకముందు సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటి ముంగిటకే వస్తాయని చంద్రబాబు నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చటం లేదు. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా. నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచారు.
– పాపట్ల స్వామి, కీసర
ఈ ఏడాది వ్యవసాయం దండగ అనిపించింది. చెరువుల్లో నీరు లేదు. సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడ్డాం. ధాన్యం ధర కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతంలో క్వింటా ధాన్యం రూ.2,100 అమ్మితే ఈ ఏడాది రూ. 1200కు కూడా కొనేవారు లేరు. మొక్కజొన్న పంట పరిస్థితి అదే విధంగా ఉంది. విత్తనాలు, ఎరువులు ధరలు మాత్రం బాగా పెరిగాయి. బాగా నష్టపోయాం.
– జె. శ్రీనివాసరావు, మైలవరం
వ్యవసాయం దండగైంది..

దగా చేస్తున్నారు..