
నేలతల్లికి గర్భశోకం
ఆదాయ వనరుగా ఇసుక
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక కావా ల్సినంత దొరికేది. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద లారీలతో ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
– షేక్ పీర్సామియా, పండ్ల వ్యాపారి,
పెండ్యాల, కంచికచర్ల మండలం
రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి
రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువులు, కుంటల మట్టిని కూటమి నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో లోతుగా మట్టిని తవ్వి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. గతంలో ఇటువంటి గోతులు తీయటం వల్ల ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టడంలేదు.
– కందుల అశోక్కుమార్, రైతు, పేరకలపాడు,
కంచికచర్ల మండలం
అధికారులకు పట్టడంలేదు
క్వారీల్లో బిహార్, తమిళనాడు, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలు అధికంగా వాడటం వల్ల బ్లాసింగ్ సమయంలో కార్మికులు మృతి చెందుతున్నారు. వారి కుటుంబాలకు క్వారీ నిర్వాహకులు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
– కోట కల్యాణ్, వ్యవసాయ, కార్మిక సంఘ ఎన్టీఆర్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి
కంచికచర్ల: అధికారం అండతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రకృతి సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక మాటున మాఫియాను నడిపిస్తున్నారు. ఒక్క ఇసుకే కాదు, మట్టి, కంకర ఇలా ఏ ఒక్క దానినీ వదలకుండా యథేచ్ఛగా దోచేస్తూ నేల తల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. ఎక్కడ ప్రకృతి సంపద కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి దోపిడీ పర్వానికి బాటలు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ పర్వం కొనసాగుతుండటంతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. కళ్లముందే అక్రమాలు జరుగు తున్నా దృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. అధికారుల నుంచి కనీస చర్యలు కూడా కనిపించకపోవడంతో ప్రజాప్రతినిధుల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు సైతం పేట్రేగిపోతున్నారు.
యథేచ్ఛగా ఇసుక దందా
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఎంత కావాలన్నా లభించేది. ఇసుక ధరలు సైతం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేవి. దీంతో ప్రతి ఒక్కరూ సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించటంలేదు. పేరుకు ఉచిత ఇసుక అయితే పేదలకు మాత్రం దొరకడంలేదు. ఇసుక రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిపోతోంది. నో చలానా.. ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచ రులు ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని బహిరంగంగా చెబుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆ ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ల నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీలను యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు.
కంచికచర్ల మండలం దొనబండక్వారీ నుంచి కంకరను తరలిస్తున్న లారీ
ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు తెగబడుతున్న ‘పచ్చ’ మాఫియా సహజ సంపదను నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్న వైనం ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా దోపిడీ పర్వం ఈ అక్రమాలను పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందుబాటులో ఇసుక
ప్రకృతి సంపదను దోచేస్తున్న కూటమి గద్దలు

నేలతల్లికి గర్భశోకం

నేలతల్లికి గర్భశోకం

నేలతల్లికి గర్భశోకం

నేలతల్లికి గర్భశోకం

నేలతల్లికి గర్భశోకం

నేలతల్లికి గర్భశోకం