
ప్రలోభాలు, బెదిరింపులతో గట్టెక్కిన టీడీపీ
తిరువూరు: ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో ఫ్యాను గుర్తుపై గెలిచిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్న తిరువూరు నగర పంచాయతీలో 17 మంది వైఎస్సార్ సీపీ సభ్యులే. చైర్ పర్సన్ కస్తూరిబాయి పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్కు చైర్పర్సన్గా అవకాశం కల్పించడానికి కౌన్సిలర్లు ఏకగ్రీ వంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే నెల 19న చైర్పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తదనుగుణంగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు ప్రలోభా లకు గురిచేసి ముగ్గురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పారు. అప్పటికీ వారికి బలం సరిపోకపోవడంతో ఎన్నిక ప్రక్రియకు విఘాతం కలిగించారు. ఎన్నికను సైతం వాయిదా వేయించగలిగారు. మర్నాడు మే 20వ తేదీన జరగాల్సిన చైర్పర్సన్ ఎన్నికను సైతం టీడీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌన్సిలర్లకు రక్షణ కల్పించి వారిని చైర్పర్సన్ ఎన్నికకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. రెండో రోజు కూడా చైర్పర్సన్ ఎన్నిక జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది.
ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో తిరువూరు చైర్పర్సన్ ఎన్నిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల కొనుగోలుతో నెగ్గిన కూటమి పంతం
డబ్బు ఎరచూపి...
వాయిదా పడిన చైర్పర్సన్ ఎన్నికను సోమవారం నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత వారం రోజులుగా టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మళ్లీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకోగలిగారు. అతి బలవంతం మీద వైఎస్సార్ సీపీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ కౌన్సిలర్లతో కలిపి 10 మంది, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకోగలిగారు.