
పాత టైరు షెడ్లో అగ్నిప్రమాదం
ఆటోనగర్(విజయవాడతూర్పు):
జవహర్ ఆటోనగర్ రెండవ క్రాస్ 4వ రోడ్డు లోని పాత టైరు షెడ్లో బుధవారం రాత్రి సుమారు 10.30 గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షలకు పైగా విలువైన పాత టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్డు యజమాని హుస్సేన్ బాబా తెలిపిన వివరాల మేరకు... గత రాత్రి 10.30 గంటల తర్వాత హుస్సేన్ బాబా షెడ్డు వెనుక నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షెడ్డు వెనుక భాగంలో ఎవరైనా చెత్తకు నిప్పు పెట్టడం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని ఆగ్నిమాపక అధికారి నరేష్ తెలిపారు.
మంటలు విస్తరించివుంటే...
రెండవ క్రాస్ 4వ రోడ్డులో సుమారు 300కు పైగా పాత టైర్ల షాపులు ఉంటాయి. రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు వ్యాపించి ఈ షాపులకు నిప్పు అంటుకుని ఉంటే రూ.కోట్లల్లో ఆస్తినష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.
సుమారు రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం తప్పిన పెను ప్రమాదం