
ఘనంగా సావర్కర్ జయంతి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని బీజేపీ కా ర్యాలయంలో బుధవారం వినాయక్ దామోద ర్ సావర్కర్ జయంతిని నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ మాట్లాడుతూ.. సావర్కర్ దేశభక్తిని బ్రిటీష్ హింస కదిలించలేదని తెలిపా రు. ఆయన ధైర్యం, పోరాటం ఎప్పటికీ మరువరాదని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు దేశ అభివృద్ధికి దీప స్తంభమని కొనియాడారు. కా ర్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసె ల అర్జున్, పట్టణాధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, మండల ప్రధాన కార్యదర్శి విజ య్, నాయకులు గవాస్కర్, రాజు, కుర్మరాజు, రావుల్వార్ విఠల్, విజయ్ పాల్గొన్నారు.