Yashwant Sinha: భారత 15వ రాష్ట్రపతి ఎవరికీ భయపడకుండా, పక్షపాతం లేకుండా ఉంటారని ఆశిస్తున్నా

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు.. ఆమె చేతిలో ఓడిపోయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. భారత 15వ రాష్ట్రపతి ఎవరికీ భయపడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలతో పాటు తాను కూడా ముర్ముకు అభినందనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
I join my fellow citizens in congratulating Smt Droupadi Murmu on her victory in the Presidential Election 2022.
India hopes that as the 15th President of the Republic she functions as the Custodian of the Constitution without fear or favour. pic.twitter.com/0gG3pdvTor
— Yashwant Sinha (@YashwantSinha) July 21, 2022
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. విజయం అనంతరం ఆమెకు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు, ఇతర రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము