ప్రైవేట్ హాస్పిటల్స్​‌‌-హోటల్స్​ వ్యాక్సినేషన్​ ‌‌ఆఫర్లు కుదరవు

Vaccination Packages By Hotels Illegal Says Center - Sakshi

కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్​ ఐసోలేషన్​ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్​ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్​ పేరిట స్పెషల్​ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్​ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్​ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది.

న్యూఢిల్లీ:  ప్రైవేట్​ ఆస్పత్రులు, హోటల్స్​తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్​ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌, వ్యాక్సినేషన్​ గైడ్​లెన్స్​​ కూడిన లేఖల్ని శనివారం పంపించారు.

ఈమధ్య కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్​ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్​, బెడ్​, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్​ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్‌ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్​ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్​ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్​ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్​ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

ఎక్కడెక్కడంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్​ వ్యాక్సినేషన్​ సెంటర్లు, వర్క్​ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్​ వ్యాక్సినేషన్​ సెంటర్లు, గ్రూప్​ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ​ఆర్​డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్​లలో, పంచాయితీ భవన్​లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్​ ఏజ్​ హోమ్స్​లో టెంపరరీ బేస్​ మీద వ్యాక్సిన్​ అందించాలని కేంద్రం గైడ్​లైన్స్​ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top