బరితెగింపులో కొత్త తరం.. | Special Story On Sexual crimes In Indian society camera turning Proofs | Sakshi
Sakshi News home page

బరితెగింపులో కొత్త తరం..

May 10 2026 1:03 PM | Updated on May 10 2026 1:48 PM

Special Story On Sexual crimes In Indian society camera turning Proofs

భారత్‌లో మహిళలపై వేధింపులు కొత్త రూపం దాలుస్తున్నాయి.. పబ్లిక్‌ ప్రాంతాల్లో ఉన్నామనే స్పృహ కోల్పోయిన కొందరు ఆకతాయిలు.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఆ సమయంతో తమపై జరుగుతున్న వేధింపులు బాధితులు వీడియోలు తీసి.. ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

అయితే, ప్రజలు వీడియోలు తీస్తున్నారు కానీ.. నేరాన్ని అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోలీసులు కూడా తీరా నష్టం జరిగిన తర్వాత అరెస్ట్‌లు చేస్తున్నారు తప్ప.. ముందస్తుగా భద్రత కల్పించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి మహిళల సమస్యలపై ప్రత్యేక శిక్షణ అవసరమని.. ఇది ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవడంలో సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి తప్పులు చేస్తున్న సమయంలోనే ప్రజలే వీటిని అడ్డుకోవాలని సూచిస్తున్నారు.

ముఖ్య ఘటనలు (2024–2026)

  • రాజస్థాన్ బైక్ టాక్సీ ఘటన: మహిళ దుస్తులు లాగిన ఘటన వీడియోలో రికార్డ్ అయింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే అరెస్టులు చేశారు.

  • జైపూర్ గర్భిణీ మహిళ కేసు: సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్ గుర్జర్‌ను అరెస్టు చేశారు.

  • ఢిల్లీ బస్సు ఘటన: ఒక వ్యక్తి బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. వీడియో వైరల్ అయిన తర్వాతే చర్యలు తీసుకున్నారు.

  • ముంబై లోకల్ ట్రైన్ ఘటన: మహిళ వీడియో తీసి బయటపెట్టిన తర్వాతే పోలీసులు స్పందించారు.

  • పుణే బస్సు ఘటన: మహిళను తాకిన వ్యక్తిని ఆమె బహిరంగంగా చెంపదెబ్బలు కొట్టింది.

  • యూపీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ వీడియో సీసీ టీవీ ఫుటేజీతో బయటకు వచ్చింది.

  • ఎయిర్ ఇండియా విమాన ఘటన: 2023లో ఒక ప్రయాణికుడు మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.(ఒక వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేశాడన్న కేసు)

  • జైరా వసీమ్ కేసు: inappropriate touching విమానంలో జరిగింది.(అనుచితంగా తాకిన వ్యక్తి)

 

👉మే 2026లో హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి బస్‌స్టాప్ వద్ద అండర్‌ కవర్‌గా నిలబడగా, మూడు గంటల్లో 40 మంది పురుషులు ఆమెను వేధించారు. ఇది మహిళలు రాత్రి సమయంలో పబ్లిక్ స్పేస్‌లలో ఎదుర్కొనే ప్రమాదాలను స్పష్టంగా చూపించింది.

👉ఏప్రిల్ 2026లో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ/గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు సోలార్ సైకిల్ ట్రాక్‌పై వాకింగ్‌ చేస్తున్న మహిళకు వేధింపులు. ఒక దుండగుడు అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. ఈ వీడియోను ఆమె షేర్‌ చేయడంతో వైరల​్‌గా మారింది.

👉ఈ ఘటనలు జరుగుతున్న సమయంలో వీడియోలు తీశారు తప్ప.. నిందితుడిని అడ్డుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో ప్రజలు నేరాన్ని అడ్డుకోవడానికి ముందుకు రావడం అరుదు. కోర్టులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. అన్యాయం జరిగిన తర్వాత ముందుకు రావడం కన్నా.. అది జరుగుతున్న సమయంలోనే అడ్డుకోవాలని సూచించాయి.

 

పోలీసింగ్ సంస్కరణలు

  • పార్కుల్లో ఉన్న జంటలను ప్రశ్నించే మోరల్ పోలీసింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. జంటలను పార్కుల్లో ప్రశ్నించడం కంటే, అసభ్యకర ప్రవర్తనను అడ్డుకోవడంపై దృష్టి పెట్టాలి.

  • మహిళలపై జరిగే అసభ్యకర ప్రవర్తనను అడ్డుకోవడంలో ఆలస్యం, నిర్లక్ష్యం కనిపిస్తుంది.

  • ప్రాక్టివ్ పోలీసింగ్: వీడియోలు బయటపడిన తర్వాత కాకుండా, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలి.

  • జెండర్ సెన్సిటైజేషన్: పోలీసులకు మహిళల సమస్యలపై ప్రత్యేక శిక్షణ అవసరం.

  • అకౌంటబిలిటీ మెకానిజం: ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • వైరల్ వీడియోలపై ఆధారపడటం: ఫిర్యాదు వచ్చిన వెంటనే కాకుండా, వీడియోలు బయటపడితేనే పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు.

  • తక్షణ శిక్ష లేకపోవడం: నేరస్థులు వెంటనే శిక్షించబడక పోవడం వల్ల, వారు మళ్లీ అదే ప్రవర్తనకు వెళ్తారు.

సామాజిక దృక్పథం:

  • మహిళల దుస్తులు, ప్రవర్తనను ప్రశ్నించే బదులు, వేధింపులను అడ్డుకోవడం ముఖ్యం.

  • పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు అవసరం.

  • శిక్షణ: ప్రజలకు వేధింపులను చూసినప్పుడు ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి.

  • సేఫ్టీ నెట్‌వర్క్స్: బస్సులు, ట్రైన్లలో ప్రయాణికులు కలిసి స్పందించే విధానాలు ఏర్పరచాలి.

  • లీగల్ ప్రొటెక్షన్: జోక్యం చేసుకున్న వారిని చట్టపరంగా రక్షించే నిబంధనలు ఉండాలి.

  • కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో కలిసి పనిచేసే విధానం ద్వారా నేరాలను ముందుగానే అడ్డుకోవచ్చు.

  • టెక్నాలజీ వినియోగం: సీసీటీవీ, బాడీ కెమెరాలు, డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థలు ఉండాలి.

 

 


ప్రత్యేక బోగీలు

  • మహిళల ప్రత్యేక బోగీలు: ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఉన్నాయి.

  • ప్రయోజనం: మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో భద్రతా భావన పెరుగుతుంది.

  • సమస్యలు: కొన్ని సందర్భాల్లో ఈ బోగీల్లో కూడా వేధింపులు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో భద్రతా సిబ్బంది లేకపోవడం సమస్య.

  • అవసరమైన మార్పులు: ప్రత్యేక బోగీల్లో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, panic buttons ఏర్పాటు చేయాలి.

  • కెమెరాలు: బస్సులు, ట్రైన్లు, విమానాల్లో కెమెరాలు అమర్చడం ద్వారా నేరాలను రికార్డ్ చేయవచ్చు.

భారత్‌లో ప్రస్తుతం శాసనపరమైన మహిళల ప్రాతినిధ్యం గురించి చర్చ నడుస్తోంది. కానీ ఉన్నత స్థాయిలో ప్రాతినిధ్యం అనేది క్షేత్రస్థాయిలో భద్రతకు ప్రత్యామ్నాయం కాలేదు. ఒక మహిళ ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఇంటికి నడిచి వెళ్లగలదా, బస్సు ఎక్కగలదా, రైలు ఎక్కగలదా లేదా నగరం గుండా ప్రయాణించగలదా? ప్రస్తుతానికి, ఆ ప్రశ్నకు సమాధానం షరతులతో కూడుకుని ఉంది. ఇలాంటి కేసులు పెరగడం ఒక నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. ఇది మహిళలు, ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement