యూపీలో తుపాన్‌ బీభత్సం.. 56 మంది మృతి | 40 people killed in cyclone in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో తుపాన్‌ బీభత్సం.. 56 మంది మృతి

May 14 2026 7:14 AM | Updated on May 14 2026 7:48 AM

40 people killed in cyclone in Uttar Pradesh

లక్నో: యూపీలో తుపాన్‌ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా సంభవించిన బలమైన తుఫానులు, భారీ వర్షాల దాటికి పదుల  సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగులు, వర్షాలు, బలమైన తుఫాను గాలుల కారణంగా దాదాపు  56 మందికి పైగా ప్రజలు  ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర సహాయక కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు ప్రభావం ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు,చెట్లు నెలకొరిగాయి. దీనివల్ల అనేక చోట్ల మరణాలు సంభవించాయి.మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పని చేస్తున్న వారు లేదా వర్షం నుండి తప్పించుకోవడానికి చెట్ల కింద ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement