నోటీసులు ఇస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

నోటీసులు ఇస్తున్నాం

Apr 26 2025 12:20 AM | Updated on Apr 26 2025 12:20 AM

నోటీస

నోటీసులు ఇస్తున్నాం

పేట – కొడంగల్‌ ప్రాజెక్టు కింద భూముల పెగ్‌ సర్వే పూర్తి అయింది. రైతులకు నోటీసులను అందజేస్తున్నాం. అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలిస్తున్నాం. రీ సర్వే కోరిన చోట సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను పంపించి సర్వే చేయిస్తున్నాం. రైతులు అందరూ సహకరించి నోటీసులు తీసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు భూ నష్టపరిహారం వస్తుంది.

– చింత రవికుమార్‌, తహసీల్దార్‌, ఊట్కూర్‌

ఎకరాకు రూ.60 లక్షలు ఇవ్వాలి

బహిరంగ మార్కెట్‌లో ఎకరానికి రూ. 60 లక్షలు పలుకుతుంది. ఆ ప్రకారం తమకు భూ నష్టపరిహరం ఇవ్వాలి. తనకున్న నాలగు ఎకరాల భూమి ఈ ప్రాజెక్టులో పోతుంది. ప్రభుత్వం ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎలా. భూమి పోతే భూమి అయినా చూపించాలి. ఈ కాలంలో భూమి పోతే భూమి సంపాదించుకోవడం చాలా కష్టం. – దాసరి కనకదాసు,

రైతు, బాపూర్‌ గ్రామం, ఊట్కూర్‌ మండలం

ఇంటికో ఉద్యోగం..

ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎకరానికి నష్టపరిహారం బహిరంగా మార్కెట్‌లో ఉన్న విలువ ప్రకారం ఇవ్వాలి. – నర్సింహులు గౌడ్‌,

రైతు బాపూర్‌, ఊట్కూర్‌ మండలం

స్పష్టత ఇవ్వడంలేదు..

భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇస్తారనేది ఎవరూ స్పష్టత ఇవ్వడంలేదు. అన్ని భూములకు ఒకే ధర ఇస్తామంటే నష్టపోతాం. ఎకరానికి రూ.60 లక్షలు ఇవ్వాలి.

– ఎం.సురేందర్‌రెడ్డి, రైతు, ఊట్కూర్‌

నోటీసులు ఇస్తున్నాం  
1
1/2

నోటీసులు ఇస్తున్నాం

నోటీసులు ఇస్తున్నాం  
2
2/2

నోటీసులు ఇస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement