
మైనారిటీలకు సబ్సిడీ రుణాలు
● దరఖాస్తుకు మే 25 ఆఖరు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారి టీ, క్రిిస్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు మే 25లో గా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపా రు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్ట్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు వివరాలను https://apobmms.apcfss.in వెబ్సైట్లో నమో దు చేసుకోవాలన్నారు. వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, లేదా 9848864449, 9440822219 నెంబర్లను సంప్రదించాలన్నారు.