స్పెషల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం

Apr 25 2025 1:02 AM | Updated on Apr 25 2025 1:02 AM

స్పెషల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం

స్పెషల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం

నందికొట్కూరు: స్థానిక కోట జెడ్పీ హైస్కూల్‌ 9వ తరగతి విద్యార్థి భాను ప్రసాద్‌ రాష్ట్రస్థాయి స్పెషల్‌ ఒలింపిక్స్‌ భారత్‌ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో హీల్‌ స్కూల్‌లో ఈనెల 23 జరిగిన రాష్ట్రస్థాయి స్పెషల్‌ ( ప్రత్యేక అవసరాలు గల క్రీడాకారులు) ఒలంపిక్స్‌ భారత్‌ క్రీడల్లో నంద్యాల జిల్లా తరుపున 50 మీటర్ల పరుగు పందెంలో భాను ప్రసాద్‌ స్వర్ణ పతకం సాధించారు. ఈ మేరకు గురువారం పాఠశాల హెచ్‌ఎం సాలమ్మ, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌, ఉపాధ్యాయులు క్రీడాకారుడిని అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ భాను ప్రసాద్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈఆర్‌టీ రవిబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement