భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి

Jun 27 2025 4:10 AM | Updated on Jun 27 2025 4:10 AM

భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి

భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి

నార్కట్‌పల్లి : ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌కు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌ను సందర్శించి మాట్లాడారు. కాల్వ పనులను వేగవంతంగా పూర్తి చేస్తే రిజర్వాయర్‌ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పానగల్‌ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌లోకి రెండు రోజులుగా నీరు విడుదలవుతుందని, మరో రెండు రోజుల్లో రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండనుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూములను అప్పగించిన రైతులకు పరిహారం చెల్లింపులలో జాప్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె, శ్రీనివాస్‌, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి, శ్రీనివాస్‌రెడ్డి,డిఈ వీఠలేశ్వర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, దామెర ఉదయ్‌కుమార్‌, బొడిగె స్వామి ఉన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement