బాల్య వివాహాలతో అనర్థాలు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలతో అనర్థాలు

Jun 26 2025 6:21 AM | Updated on Jun 26 2025 6:21 AM

బాల్య వివాహాలతో అనర్థాలు

బాల్య వివాహాలతో అనర్థాలు

మిర్యాలగూడ : బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని దుబ్బతండా బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించి బాలికా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ఆడపిల్లలు 18 సంవత్సరాలు, అబ్బాయిలు 21 సంవత్సరాలు నిండాకే వివాహాలు చేసుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే స్యలను ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. బాలికలు రుతుక్రమ సమస్యలపై అవగాహన కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ మమత, ఆయుర్వేధిక్‌ డాక్టర్‌ హేమాంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, ఎంఈఓ బాలు, ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సరస్వతి, వెంకన్న, వైద్యులు రవికుమార్‌, మోయిద్‌, ప్రిన్సిపాల్‌ ఉమాదేవి, గణేష్‌, అశ్రిత, కవిత, చినరాయుడు, కవిత, సక్కు, భవాని తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

త్రిపురారం : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం త్రిపురారం ఎన్నెస్పీ క్యాంప్‌ ఆవరణలోని బాలికల వసతి గృహన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ భవనాన్ని పరిశీలించి కొన్ని గదుల పైకప్పు పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించి.. సురక్షితమైన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్‌ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎస్‌ఐ నరేష్‌ ఉన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement