నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే! | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే!

Jun 25 2025 1:31 AM | Updated on Jun 25 2025 1:31 AM

నాలుగు ఎకరాలున్నా..  రైతు భరోసా రాలే!

నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే!

మహిళా రైతు ఆవేదన

చందంపేట : చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన తుమ్మల మల్లమ్మకు 4 ఎకరాల భూమి ఉండగా పత్తి విత్తనాలు విత్తింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందింది. కానీ తాజాగా ఆమెకు రైతు భరోసా అందలేదు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని అందులో కూడా పత్తి సాగు చేస్తోంది. ఈ విషయమై ఆమె వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పకుండా.. ఆన్‌లైన్‌ నుంచి భూమి తొలగించారని చెబుతున్నారని మల్లమ్మ వాపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement