పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

Jun 25 2025 1:31 AM | Updated on Jun 25 2025 1:31 AM

పాలిస

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

రామగిరి(నల్లగొండ) : పాలిసెట్‌ – 2025 కౌన్సిలింగ్‌ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.నరసింహ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్‌ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

మహిళలు పొదుపుపై దృష్టి పెట్టాలి

మునుగోడు : మహిళలు సమాఖ్య సంఘాల్లో చేరి తమ ఆదాయంలో కొంత నగదుని పొదుచేసుకోవాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడులోని మహిళా సమాఖ్య భవనంలో నూతనంగా ఎన్నికై నా మహిళ సమాఖ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కోశాధికారులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్ధిక అభివృద్ధికి అనేక ప్రోత్సహాకాలు అందిస్తోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ ఈ.విజయభాస్కర్‌, ఏపీఎం మేసేశ్వరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు పంతంగి రాధ, కార్యదర్శి బోయపర్తి యాదమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

నాగార్జునాసాగర్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి కోరారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత జిల్లాస్థాయి సమావేశం మంగళవారం సాగర్‌లోని విజయవిహార్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలమైన నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు చెల్లని నాణానికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌, కంకణాల నివేదితారెడ్డి, పిల్లి రామరాజుయాదవ్‌, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, చనమోని రాములు, ఎస్కే బాబా, వీరారెడ్డి, రామదాసు, తంగరాజు, రాజు పాల్గొన్నారు.

బాలికాసాధికారిత

సాధించాలి

గుర్రంపోడు : కేజీబీవీ విద్యార్థినులు బాగా చదువుకుని ప్రయోజకులై స్వశక్తితో ఎదిగి బాలికా సాధికారికతను సాధించే దిశగా ముందుకు సాగాలని జీసీడీఓ కె.అరుందతి ఆకాంక్షించారు. మంగళవారం గుర్రంపోడు కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిని కనీస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధించాలని టీచర్లకు సూచించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని.. విద్యార్థినులకు ఇబ్బంది కలగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కేర్‌ టేకర్‌ రోజూ స్టడీ అవర్స్‌ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ విజయశ్రీ, సిబ్బంది రాధా, సులోచన, కవిత, ఉమాదేవి, ధనలక్ష్మి, నేహదీప్తి, నీలవేణి, జ్యోతి, కేర్‌ టేకర్‌ స్వాతి, ప్రమీల పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కోసం జిల్లాలోని ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31వ తేదీలోగా telanganaepass.cgg.gov.inలో వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. హార్డ్‌ కాపీని వారి బయోడేటా కుల, ఆధాయ ధ్రువీకరణపత్రాలు, డిగ్రీ మార్కుల జాబితా, బార్‌ కౌన్సిల్‌ నమోదు పత్రాలు జత చేసి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సందేహాలు, పూర్తి వివరాల కోసం షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం1
1/1

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement