
ఇరాన్పై దాడిని ఖండించాలి
మిర్యాలగూడ అర్బన్ : ఇరాన్పై అమెరికా దాడులను ఖండించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. ఇరాన్పై దాడులను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని యాద్గార్పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని స్పష్టంగా చెప్పినప్పటికీ అమెరికా తమ ఆధిపత్యం కోసం ఇరాన్పై యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, వరలక్ష్మి, పరశురాములు, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు.