
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
నల్లగొండ : యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలోని ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యం అనే అంశంపై ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్ హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, విద్యార్థులు తదితరలుఉ పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసు వృత్తి నైపుణ్యాలపై డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల, సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. డ్యూటీ మీట్లో గెలుపొందిన వారిని రేంజ్ మీట్కి పంపుతామన్నారు. కేసుల దర్యాప్తులో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో పట్టు సాధించాలని సూచించారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో ఆయన పాల్గొని 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్

మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు