
26 సార్లు ఫోన్చేసినా కలెక్టర్ స్పందించలే..!
నల్లగొండ: నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్తో చర్చించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణికి వచ్చానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ఫోన్ చేసినా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయవాని శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే ప్రదీప్రెడ్డిపై అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్నారు. తప్పుడు రిపోర్టులతో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు.
ఫ అందుకే ప్రజావాణికి వచ్చా..
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

26 సార్లు ఫోన్చేసినా కలెక్టర్ స్పందించలే..!