
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.