
రైతు భరోసా రూ.592.55 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా పథకం కింద జిల్లాలో శనివారం వరకు 4,97,280 మంది రైతులకు రూ.592.55 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వ్యవసాయ సాగుకు పెట్టుబడికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తోందని పేర్కొన్నారు. విడతల వారీగా రోజూ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తోందని తెలిపారు.
భవిత కేంద్రం
ఆకట్టుకునేలా ఉంది
నల్లగొండ : నల్లగొండలోని భవిత కేంద్రం అందరిని ఆకట్టుకునేలా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రం ఆధునీకరణ పనులను శనివారం ఆమె పరిశీలించిన మాట్లాడారు. ఆధుననీకరణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. భవిత కేంద్రం పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉందని కేంద్రంలో ఉన్న విద్యార్థుల వివరాలను ఎంఈఓ అరుంధతిని కలెక్టర్ అడిగారు. అనంతరం కలెక్టర్ సీ్త్ర శక్తి భవన్ను, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, ఏపీఎం వినోద ఉన్నారు.
24న జాబ్ మేళా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీలో ఈ నెల 24న అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.దస్రూనాయక్, ప్రిన్సిపాల్ ఎం.షీబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పారా మెడికల్ కోర్సు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాన్ పారామెడికల్ కోర్సు విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ తేవాలని సూచించారు.
బీఎల్ఓలకు శిక్షణ నివ్వాలి
నల్లగొండ : బీఎల్ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి బూత్స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాస్టర్ ట్రైనర్లకు ఈఆర్ఓలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో సాగర్ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.