
నకిరేకల్కు నేడు మంత్రుల రాక
నకిరేకల్ : నకిరేకల్కు ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకటి శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి రానున్నారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించేఉ సభలో నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఇందుకోసం పట్టణంలోని మినీ స్టేడియం మైదానాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. సేడ్డియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, తహసీల్దార్ జమురుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు.