
ఆర్మీ డిగ్రీ కాలేజీని బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలి
మోత్కూరు: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్కు తరలించిన బీబీనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను తిరిగి బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలని కళాశాల పేరెంట్స్ కమిటీ సెక్రటరీ ఎర్రవెల్లి నర్సయ్య ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. భువనగిరి పట్టణానికి వచ్చిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను ఈ జిల్లాలోనే నిర్వహించాలని, ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ పర్యవేక్షణలో ఎన్డీఏ, యూపీఎస్సీ తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించకుండా జరుగుతున్న కుట్రలో భాగమే కళాశాల తరలింపు అని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ డి. తిరుమలేష్, స్వరూపారాణి తదితరులు ఉన్నారు.
ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతి