
ఉరేసుకుని యువకుడి బలవర్మణం
భూదాన్పోచంపల్లి: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం జూలూరులో శనివారం జరిగింది. వివరాలు.. జూలూరు గ్రామానికి చెందిన యాకరి యాదయ్య, సుశీల దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (30) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహం కాలేదు. శనివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి ఇంటికి వచ్చిన ప్రశాంత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి ప్రశాంత్ ఉరికి వేలాడుతుండటం గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో ప్రశాంత్ను కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాుచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.