నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్‌

Jun 22 2025 3:18 AM | Updated on Jun 22 2025 3:18 AM

నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్‌

నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్‌

సూర్యాపేటటౌన్‌: నకిలీ పత్తి విత్తనాల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్‌ తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న ఆత్మకూరు(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ గ్రాం బస్‌ స్టేజీ వద్ద సీసీఎస్‌, ఆత్మకూరు(ఎస్‌) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన తండా నగేష్‌తో పాటు మరో ముగ్గురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న అరుణోదయ విత్తనాల తయారీ సంస్థ ఎండీ సాంబశివరావు, మరో నిందితుడు చెవుల నరసింహులును శనివారం ఏపీలోని కర్నూలు జిల్లా కొసగి మండలం పల్లిపాడు వద్ద వ్యవసాయ క్షేత్రంలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి విత్తనాలకు కలరింగ్‌ చేసే మిషన్‌, వేయింగ్‌ మిషన్‌, ప్యాకింగ్‌ హీట్‌ మిషన్‌, ఖాళీ ప్యాకెట్లు, రెండు కిలోల లూజ్‌ నకిలీ పత్తి విత్తనాలు, బొలేరో వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ రాజశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement