
భూ సమస్యలపై 42,534 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారంతో ముగిసాయి. వివిధ భూ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా 42,534 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కవగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 14803 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఈ నెల 3న ప్రారంభించారు. సదస్సుల నిర్వహణకు ప్రతి మండలంలో రెండు బృందాలనే ఏర్పాటు చేశారు. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యులుగా వ్యవహరించారు. రోజుకు రెండు గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తమకున్న రకరకాల భూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సదస్సుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. సదస్సులను ఎప్పటికప్పుడు కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ, ఆర్డీఓలు పర్యవేక్షించారు.
రెవెన్యూ సదస్సులు,
దరఖాస్తుల వివరాలు ఇలా..
జిల్లాలో మండలాలు 33
రెవెన్యూ గ్రామాలు 550
వచ్చిన దరఖాస్తులు 42,534
మిస్సింగ్ సర్వే నెంబర్లపై 14,803
పెండింగ్ మ్యూటేషన్లు,
కోర్డు ఆర్డర్లు అమలు చేయాలని 802
డిజిటల్ సంతకం పెండింగ్పై 795
పేరు, విస్తీర్ణం తప్పులపై 2,998
నిషేధిత జాబితాపై 808
అసైన్డ్ భూములపై 6,539
ఫౌతిపై 1,400
భూ సేకరణపై 56
ఇతర సమస్యలపై 14,333
ఫ మిస్సింగ్ సర్వే నంబర్లపైనే అధికంగా..
ఫ ముగిసిన రెవెన్యూ సదస్సులు