‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక

Jun 21 2025 3:21 AM | Updated on Jun 21 2025 3:21 AM

‘బెస్

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక

నల్లగొండ: బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. శుక్రవారం పానగల్‌ రోడ్డులోని గిరిజన వసతి గృహంలో డ్రా నిర్వహించారు. జిల్లాలోని ఆరు ప్రైవేట్‌ పాఠశాలల్లో 34 మంది బాలబాలికలకు లాటరీ ద్వారా సీట్లు కేటాయించారు. మొత్తం 184 దరఖాస్తులు రాగా 34 సీట్లు మాత్రమే కేటాయించడంతో సీట్లు ఎందుకు తగ్గించారంటూ పిల్లల తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించారు. గతంలో వంద సీట్లు ఉండగా ప్రస్తుతం కోత విధించారని అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్‌, ఏఓ పార్థసారధి, ఏటీడీఓ శ్రీనివాస్‌, రామకృష్ణ, ప్రవీణ్‌నాయక్‌, సక్రునాయక్‌ పాల్గొన్నారు.

షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులు..

నల్లగొండ: 2025– 26 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 1, 5 తరగతుల్లో ప్రవేశానికి శుక్రవారం నల్లగొండ ఉదయాదిత్య భవన్‌లో డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌ కుమార్‌ లక్కీ డ్రా తీశారు. 1వ తరగతిలో ప్రవేశానికి 134 మంది విద్యార్థులు, 5వ తరగతిలో ప్రవేశానికి 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక1
1/1

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement