శిశు మరణాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

శిశు మరణాలపై అవగాహన కల్పించాలి

Jun 21 2025 3:21 AM | Updated on Jun 21 2025 3:21 AM

శిశు మరణాలపై అవగాహన కల్పించాలి

శిశు మరణాలపై అవగాహన కల్పించాలి

నల్లగొండ: గ్రామీణ ప్రాంత మహిళల్లో శిశు మరణాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. శిశు మరణాలపై శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ప్రసవాలకు మధ్య దూరం ఎక్కువగా లేకపోవడంతో శిశు మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే బిడ్డ సరైన విధంగా పుట్టకపోవడం, బరువు తక్కువగా ఉండడం, పుట్టిన తర్వాత మరణించేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేలా, పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్‌, డాక్టర్‌ మాతృనాయక్‌, కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement