తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

Jun 17 2025 4:55 AM | Updated on Jun 17 2025 4:55 AM

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

అయిటిపాముల గ్రామంలో సర్వే నంబర్‌ 937లో 3.31 ఎకరాల భూమి ఉంది. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంలో మా పేరు మీద ఉన్న భూమిని కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కుమ్మకై ్క 1.30 ఎకరాల భూమిని కొప్పు పద్మ పేరు మీద ముక్కెర సైదులు అలియాస్‌ ప్రభు ఆన్‌లైన్‌లో నమోదు చేయించాడు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి తప్పుడు రికార్డులు సృష్టించిన విజయ్‌తో పాటు ముక్కెర సైదులు మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. వారు జైలుకు వెళ్లి వచ్చారు. వారిలో ఒకరైన ముక్కెర సైదులు అలియాస్‌ ప్రభు అనే వ్యక్తి తన పేరును ముక్కెర వెంకట రమణగా మార్చుకుని గోపగాని జానయ్యతో కలిసి లేని భూమిని ఉన్నట్లుగా సృష్టించి ఆరు తప్పుడు డాక్యుమెంట్లతో సర్వే నెంబర్‌ 937,938లో 4.9 కుంటల భూమిని తన భార్య సైదమ్మ పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ భూమిలో 3.30 కుంటల భూమిని మరో వ్యక్తికి సైదమ్మ రిజిస్ట్రేషన్‌ చేసింది. అక్కడ భూమి లేకున్నా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – చెవుగోని శ్రీనివాస్‌,

అయిటిపాముల, కట్టంగూర్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement