
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ
పెద్దవూర : కేంద్రంలో మోదీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్శరించి, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తోందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. ఆదివారం పెద్దవూర మండలంలోని పులిచర్లలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ప్రాణంగా ప్రజలకు అండగా సీపీఐ జెండా నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిని అదుపు చేయకుండా పేదవారి నడ్డివిరిచే విధంగా కేంద్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గడ్డంపల్లి భిక్షంరెడ్డి, నాయకులు పొదిల నర్సింహ, లక్ష్మీపతి, రొయ్య రాములు, శోభన్బాబు, నాగార్జున, జయప్రకాశ్రెడ్డి, విజయానంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.