
కేసుల పరిష్కారానికి చొరవ చూపండి
నాగర్కర్నూల్ క్రైం: జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యే క్రిమినల్, చెక్బౌన్స్ కేసులతో పాటు పెట్టి కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని.. జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. సమావేశంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి ఎన్.శ్రీనిధి ఉన్నారు.