
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పెద్దకొత్తపల్లి: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా బుధవారం పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిర్మలాపూర్ నుంచి వెన్నచర్ల గుండా నక్కలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు, మహనీయుల ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, మాజీ సర్పంచులు సత్యం, రాధ, రవికుమార్, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.