
రూ. 4.29కోట్లతో మరమ్మతులు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మరమ్మతు నిమిత్తం రూ. 4.29కోట్లు మంజూరు కాగా.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైట్లు, బోర్డుల ఏర్పాటు, ఇతరత్రా పనులు చేపడుతున్నారు. మొత్తం 411 పాఠశాలల భవనాల మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపగా.. 110 బడుల్లో వందశాతం పనులను పూర్తిచేశారు. 162 బడుల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 139 పాఠశాలల్లో పనులు ఇంకా మొదలుకాలేదు. ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నిర్ణీత సమయానికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.