
డయేరియా నివారణకు రోటసిల్ వ్యాక్సిన్
నాగర్కర్నూల్ క్రైం: చిన్నారుల్లో డయేరియా నివారణ కోసం రెండు డోస్ల రోటసిల్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి ఆరోగ్య ఉప కేంద్రంలో చిన్నారులకు రోటసిల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 178 ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోటసిల్ వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో చిన్నారులకు ఒక డోస్ రోటవైరస్ వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు డోస్ల రోటసిల్ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాస్, జిల్లా టీకాకరణ అధికారి డా.రవికుమార్, డా.వాణి తదితరులు పాల్గొన్నారు.