రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Jun 11 2025 11:42 AM | Updated on Jun 11 2025 11:42 AM

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

తెలకపల్లి: రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం తెలకపల్లిలో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు రైతుల సమస్యల పరిష్కారం కోసమే జరుగుతున్నాయని, రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను బడీడు పిల్లలను నమోదు చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత వసతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలుపుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement