
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, నాగర్కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచ వ్యాప్తమైందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కూలంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని, మోదీ పాలన ఓ స్వర్ణయుగం అని వివరించారు. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, పట్టణాధ్యక్షుడు ప్రమోద్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్చారి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
బీజేపీ ఎంపీ రఘునందన్రావు