పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 10 2025 3:16 AM | Updated on Jun 10 2025 3:16 AM

పేదల సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కల సాకారం

చారకొండ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. చారకొండ రైతువేదికలో సోమవారం 240మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొదటి జాబితాలో పేరు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ బాలాజీ సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, తహసీల్దార్‌ సునీత, ఎంపీడీఓ ఇసాక్‌ హుస్సేన్‌, మాజీ జెడ్పీటీసీ వెంకట్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్‌, మహేందర్‌, జైపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement