6 నుంచి ‘బడిబాట’ | - | Sakshi
Sakshi News home page

6 నుంచి ‘బడిబాట’

Jun 5 2025 8:16 AM | Updated on Jun 5 2025 8:16 AM

6 నుం

6 నుంచి ‘బడిబాట’

కందనూలు: ప్రొ. జయశంకర్‌ బడిబాట కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలు పాఠశాలలో ఉండేలా చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు వివరించడం, మన బడిలో గ్రామస్తులను భాగస్వాములను చేస్తామని సూచించారు. నాణ్యమైన విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రోత్సహిస్తూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు.

సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దకొత్తపల్లి: గ్రామాల్లోని భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని ఆదిరాలలో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

నాగర్‌కర్నూల్‌: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

6 నుంచి ‘బడిబాట’ 
1
1/1

6 నుంచి ‘బడిబాట’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement