
వన్ టైం పరీక్ష రాసే అవకాశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్టైం పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల కోర్సు, అదనంగా రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ కలిగి ఉండాలని, బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని, ఈ నెల 16వ తేదీ లోగా ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని, 20వ తేదీ వరకు జరిమానాతో ఫీజుచెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.