
చేపలకు భలే డిమాండ్..
ములుగులో చేపలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తినడం ఆనవాయితీ వస్తున్న ఆచారం. దీంతో ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం అవుతుండడంతో చేపలకు భలే డిమాండ్ ఉంది. ములుగు జిల్లా కేంద్రంలో, ఏటూరునాగారం, వెంకటాపురం(కె), వాజేడు మండల కేంద్రాల్లో చేపలు విక్రయించే వ్యాపారులు రకరకాల చేపలను తీసుకొచ్చారు. వీటిని కొనుగోలు చేసేందుకు జనం పోటీ పడ్డారు. ఆయా ప్రాంతాల్లో గిరాకీని బట్టి కిలో చేపలకు రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయించారు. గోదావరిలో కూడా మత్స్యకారులు చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. అలాగే ఏటూరునాగారం మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు రైతులు పంట పొలాల్లో కూడా పంటలు బాగా పండాలని, వర్షాలు సంమృద్ధిగా కురవాలని భూతల్లికి పూజలు చేశారు. – ములుగు రూరల్/ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు

చేపలకు భలే డిమాండ్..

చేపలకు భలే డిమాండ్..