
ఘనంగా మేడే
కోర్టు ఆదేశాలు బేఖాతర్
సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటాయి. రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది.
– 8లోu
ములుగు/ ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జెండాలను ఆవిష్కరించారు. కార్మికులు 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసిన పోరాటంతో మే 1న కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పలువురు నాయకులు వివరించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. 44కార్మి క చట్టాలను నాలుగు కోడ్లకు కుదించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

ఘనంగా మేడే