Nayanthara: మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు

Nayanthara Walks With Chappals In Tirumala Mada Veedhi - Sakshi

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు ఈ నూతన దంపతులు నేడు(జూన్‌ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది. గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ నయన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోషూట్‌కు తిరుమల ఆలయం వేదికనుకుంటున్నారా? అని ఫైర్‌ అవుతున్నారు. వెంటనే చేసిన తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమాపణ కోరండని సూచిస్తున్నారు.

చదవండి: కిన్నెరసాని సినిమా రివ్యూ
హీరోయిన్‌పై అసభ్య కామెంట్స్‌, పోలీసులకు ఫిర్యాదు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top