Chiranjeevi : 'విరూపాక్ష' సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి.. ట్వీట్‌ వైరల్‌

Megastar Chiranjeevi Appreciates Sai Dharam Tej And Virupaksha Team - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్‌ దండు తెరకెక్కిచిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హిట్‌ టాక్‌తో థియేటర్ల వద్ద సందడి చేస్తోంది.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలిపారు. సతీమణి సురేఖ సాయితేజ్‌కు కేక్‌ తినిపిస్తున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై అద్భుతమైన స్పందన వస్తోంది. సాయితేజ్‌ విరూపాక్షతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడం, వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. వీరూపాక్ష టీంకు  హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. దీనికి మేనల్లుడు సాయితేజ్‌ స్పందిస్తూ.. థ్యాంక్యూ అత్తా, మామ. లవ్‌ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top