
"అవతార్: ఫైర్ అండ్ యాష్" కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 20th Century Studios ఓ గొప్ప బహుమతి ఇవ్వనుంది. జేమ్స్ కామెరూన్ మాస్టర్ పీస్ "అవతార్: ది వే ఆఫ్ వాటర్" అక్టోబర్ 2న భారతీయ థియేటర్స్లో ఒక వారంరోజుల పాటు 3D లో రీరిలీజ్ కానుంది. 2022 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3D వర్షన్ ద్వారా పండోరా ప్రపంచాన్ని మరోసారి చుట్టేయండి.
“ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వకండి. ఈ మనోహరమైన లోకాన్ని ముందే చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th Century Studios ఇండియా ప్రతినిధులు తెలిపారు. "అవతార్: ఫైర్ అండ్ యాష్" విషయానికి వస్తే ఈ మూవీ ఇండియాలో ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది.
చదవండి: నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్బాస్ బ్యూటీ