సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

Jun 29 2025 7:23 AM | Updated on Jun 29 2025 7:23 AM

సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

సోలార్‌ ప్లాంట్లతో మహిళా సాధికారత

నర్సాపూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర చీఫ్‌ ఆడిటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు తెలిపారు. పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్‌లోని దేవాదాయశాఖకు చెందిన భూములను శనివారం పరిశీలించారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు సబ్‌స్టేషన్‌కు పవర్‌ సరఫరా, తదతర అంశాల గురించి ఆరా తీశారు. స్థానికంగా ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్‌ను నాలుగు గ్రామాల మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పారు. కాగా రెండు మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు, నాబార్డు ఏజీఎం రామారావు, కన్సల్టెంట్‌ రామకృష్ణ, తెలంగాణ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ సంస్థ అధికారి రవీందర్‌ చౌహాన్‌, ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ ఈఓ శ్రీనివాస్‌, ఏపీఎం గౌరిశంకర్‌, ఏపీఓ అంజిరెడ్డి, సర్వేయర్‌ అభిలాష్‌ తదితరులు ఉన్నారు.

సెర్ప్‌ చీఫ్‌ ఆడిటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement