ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

Jun 29 2025 7:23 AM | Updated on Jun 29 2025 7:23 AM

ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

రామాయంపేట(మెదక్‌): తూప్రాన్‌, మేడ్చల్‌లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపక శాఖ రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సుధాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఫైర్‌స్టేషన్‌ను తనిఖీ చేసి జిల్లా అధికారి వెంకటేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో 19 జిల్లాల్లో సుమారుగా 70 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల విషయమై తమ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొత్తగా మహదేవ్‌పూర్‌, కేసముద్రం పట్ట ణాలకు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. మేడ్చల్‌ నుంచి నిజామాబాద్‌ వరకు జాతీ య రహదారిపై ఎక్కడా ఫైర్‌స్టేషన్‌ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు. అంతకుముందు ఫైర్‌ పరికరాలను పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు.

రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సుధాకర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement