
జూలై 15 వరకు విత్తుకోవచ్చు
ఏడీఏ రాంప్రసాద్
టేక్మాల్(మెదక్): వర్షాభావ పరిస్థితులతో రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని జూలై 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చని పెద్దశంకరంపేట ఏడీఏ రాంప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని బొడ్మట్పల్లిలో పత్తి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, విత్తుకునేందుకు ఇంకా సమయం మించిపోలేదన్నారు. నేల పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. పంటల సాగు లో వ్యవసాయాధికారుల సలహాలు, సూచ నలు తీసుకొని సహజ ఎరువులను వాడుతూ యాజమాన్య పద్దతులు పాటించాలని వివరించారు.