
ఎలాంటి అపోహలు వద్దు..
డివిజన్ల విభనలపై ఎలాంటి అపోహలు వద్దు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలను అనుసరించి గడియారం పద్ధతిలో చేపట్టాం. ఈ నెల 4న వెలువడింది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 16వ తేదీలోపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. మార్పులు, చేర్పుల అనంతరం 17న కలెక్టర్కు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి సీడీఎంఏకు ఫైల్ చేరుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం మేరకు 21న ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
– డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
శాసీ్త్రయత లేకుంటే అనేక ఇబ్బందులు..
డివిజన్ల విభజన శాసీ్త్రయంగా లేకుంటే అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అతుకుల బొంతగా డివిజన్లను ఏర్పాటు చేస్తే పాలనతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బందులు వస్తాయి. ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవు. రైల్వే ట్రాక్, జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న ప్రాంతాలను ఒకే డివిజన్లో కలిపితే ఎలా? ఇవతలి వైపు ఉన్న కాలనీలతో ఓ డివిజన్.. అవతలి వైపు ఉన్న ప్రాంతాలతో మరొకటి ఏర్పాటు చేయాలి.
– రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్
అధికార పార్టీకి అనుకూలంగానే..
సరైన రోడ్ మ్యాప్ లేకుండా ఇంటి నంబర్లతో డివిజన్ల విభజన చేయడం సరికాదు. కొత్తగా వీరన్నపేటలో ఏర్పాటు చేసిన 14వ డివిజన్కు సంబంధించి నోటిఫికేషన్లో 3,298 ఓట్లు ఉన్నట్ల చూపారు. కానీ ఈ ఏరియాలో 4,949 ఓట్లు ఉన్నాయి. వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదనడానికి ఇది నిదర్శనం. అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ల విభజన జరిగింది. అధికారులు తగిన మార్పులు చేయాలి. లేనిపక్షంలో న్యాయపరంగా ముందుకెళ్తాం.
– అంజయ్య, మాజీ కౌన్సిలర్
●

ఎలాంటి అపోహలు వద్దు..

ఎలాంటి అపోహలు వద్దు..