
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని శనివారం అప్పన్నపల్లిలోని ఎస్వీఎస్ డెంటల్ కళాశాల విద్యార్థులు మెయిన్ రోడ్డుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్కు కారణమైన సిగరెట్, పాన్, గుట్కా, జర్దా, ఖైనీ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్లకార్డులను పట్టుకుని న్యూటౌన్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా పొగాకు పదార్థాలతో కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డైరెక్టర్ కె.రాంరెడ్డి, వైద్య బృందం శ్రీప్రియ, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల ఆధీనంలో వాహనం, ఫర్నీచర్
మన్ననూర్: నల్లమల ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న టేకు కలప ఫర్నీచర్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నరేష్ కొన్ని రోజుల క్రితం మన్ననూర్ గ్రామానికి చెందిన బొలేరో వాహనం అద్దెకు తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటికి సంబంధించిన దూలాలతో తయారు చేసిన డైనింగ్ టేబుల్, కుర్చీలను హైదరాబాద్కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డిండి పోలీసులకు వాహనాన్ని పరిశీలించారు. వాహనంలో విలువైన టేకుతో తయారు చేసిన ఫర్నీచర్ కనిపించడంతో సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని మన్ననూర్ చెక్పోస్టు వద్దకు తరలించారు. నిజానిజాలపై విచారణ కోసం అమ్రాబాద్ ఎఫ్ఆర్ఓ, అటవీశాఖ సిబ్బందిని ఆదేశించినట్లు ఎఫ్ఆర్ఓ దేవజ తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి