జఫర్‌గఢ్‌లో ఎలుగుబంట్ల సంచారం | - | Sakshi
Sakshi News home page

జఫర్‌గఢ్‌లో ఎలుగుబంట్ల సంచారం

Jun 20 2025 6:29 AM | Updated on Jun 20 2025 6:29 AM

జఫర్‌గఢ్‌లో ఎలుగుబంట్ల సంచారం

జఫర్‌గఢ్‌లో ఎలుగుబంట్ల సంచారం

జఫర్‌గఢ్‌: జఫర్‌గఢ్‌లో రెండు రోజుల నుంచి ఎలు గుబంట్లు సంచరిస్తుండడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. జఫర్‌గఢ్‌ చుట్టూ గుట్టలు ఉండడంతో ఎలుగుబంట్లు అందులో నివా సం ఉంటున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బయన్నగుట్టల సమీపంలో దమ్మన్నపేటకు వెళ్లే రహదారిపై ఎలుగుబంటి తన పిల్లలతో వెళ్తుండగా స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యా రు. గురువారం కూడా జఫర్‌గఢ్‌ శివారులోని పల్లె పకృతి వనంలో ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఎలుగుబంటిని అక్కడి నుంచి తరిమికొట్టడంతో పంట పొ లా ల మీదుగా మసీదు బండ నుంచి వెళ్లింది. దీంతో స్థానికులు, రైతులు ఊపిరి పిల్చుకున్నారు. కాగా, కొన్నేళ్ల నుంచి గుట్టలపై ఎలుగుబంట్లు నివాసం ఉంటూ గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బంధించి వేరే అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భయాందోళనలో గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement